|
| 90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తేజం |
| గురువారం, 16 ఏప్రిల్ 2009 ( 16:27 IST ) | |
నూతన చిత్ర నిర్మాణ సంస్థ సన్రైజ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ కె.ఎస్. గోపి దర్శకత్వంలో ఎస్. రాజశేఖర్ రూపొందిస్తున్న చిత్రం తేజం. ఈ చిత్రం ద్వారా 9మంది హీరోలు ఒక హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం తొంబై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్లో నటి ప్రీతిజింగ్యానీ తళుక్కుమననుంది.
ప్రీతిజింగ్యానీపై చిత్రీకరించిన ఈ సాంగ్ చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కొన్ని మేజర్ సీన్స్, ఒక్క సాంగ్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
చిత్ర దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, అన్ని వర్గాల ప్రేక్షకులను తమ చిత్రం అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరున విడుదలచేసి మే రెండోవారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|