|
| ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం |
| శుక్రవారం, 15 మే 2009 ( 15:47 IST ) | |
కుర్కురే ఫేం ఇంద్ర హీరోగా, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రావణ్ బాపట్ల దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి బొద్దం ఇంద్రసేన నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
బిందు, శ్రీ అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తొలిషాట్కు పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టగా, హీరో బాబాయ్ గాదే రాజశేఖర్ స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర హీరో ఇంద్ర మాట్లాడుతూ కుర్కురే తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రమిదన్నారు. ఆర్టిస్టుగా 20 సినిమాల్లో నటించానని, దర్శకుడు తనపై నమ్మకంతో ఈ చిత్ర కథ వినిపించారని చెప్పారు. అది విన్నాక నిర్మాతగా తానే ఉంటేనే పాత్రకు న్యాయం చేయగలనని చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
నటి కవిత మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని అంశాలు ఉండేలా స్క్రీన్ప్లే తయారు చేశారని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ బంగారం తయారు చేసే విధానంతో కలిగిన ఇబ్బందులను సస్పెన్స్గా, ఎంటర్టైన్మెంట్గా చూపించామని తెలిపారు. ఈ నెల 18 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమౌతుందన్నారు.
ఈ చిత్రంలో జీవా, ఎం.ఎస్. నారాయణ, సూర్య, రాజేందర్, కొండవలస, ఉత్తేజ్, పృథ్వి, దువ్వాసి మోహన్, జెన్ని, దేవీశ్రీ, జయవాణి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమేరా- షమ్ము వి. ప్రభాకర్, సంగీతం- వై. సత్య, ఆర్ట్- విజయకృష్ణ, సమర్పణ- పాన్ అమెరికా, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం- శ్రావణ్ బాపట్ల.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|