|
| యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల |
| 3 డిసెంబర్ 2008 ( 15:41 IST ) | |
విద్యార్థుల జీవితాల్లో జరిగే సహజ సంఘటనలతో రూపొందిన "కళాశాల" అనే చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. "ప్రేమిస్తే" చిత్రానికి ప్రాణం పోసిన శక్తివేల్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. కాగా, ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాను నిర్మించారు.
తమిళనాడులోని ధర్మపురి పట్టణంలో ఓ కళాశాలలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా చేసుకొని తమిళంలో రూపొందిన "కల్లూరి" సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో అందరూ కొత్త నటీనటులే. ఈ తమిళ చిత్రాన్ని "కళాశాల" పేరుతో ఎంవి గోపాలరావు తెలుగులోకి అనువదిస్తున్నారు.
జ్యోతి ఆర్ట్స్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర వివరాలను గోపాలరావు వెల్లడిస్తూ.. జీవితంలో ప్రేమ గొప్పదా... స్నేహం గొప్పదా... అనే అంశంతో శక్తివేల్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని చెప్పారు. కాలేజీలో కాలుమోపిన యువతీయువకులు ముందుగా తామెవరో ఏమిటో పరిచయం చేసుకుంటారు.
కాలం తెచ్చే మార్పుల్లో కొందరు ఒకరికొకరు అవతారు. అయితే ప్రేమికులు కావడానికి ముందు మనసుల్లో ప్రేమ ఉన్నా దాన్ని బైటకు రానివ్వకుండా దాచుకుంటారు. అయితే ఆ ప్రేమ ఎప్పుడు... ఎలా బయటకువచ్చిందనేదే ఈ చిత్ర ఇతివృత్తం.
ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిక్సింగ్ జరుగుతోంది. త్వరనే తొలికాపీ సిద్ధం అవుతుందని గోపాలరావు వెల్లడించారు. ఆడియోను ఈ నెల ద్వితీయార్థంలో, సినిమాను నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పారు.
తమన్నా, అఖిల్ జంటగా నటించిన ఈ చిత్రంలో మిగిలిన పాత్రలన్నీ కొత్తవాళ్లే చేశారు. ఈ సినిమాకు మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: భువనచంద్ర, శివగణేష్, సాహితి, సంగీతం: జోష్వాశ్రీధర్, ఛాయాగ్రహణం: చెళియన్, ఎడిటింగ్: శశికుమార్. కళ: మైల్ కృష్ణన్, నిర్మాత: ఎంవి.గోపాలరావు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: బాలాజీ శక్తివేల్.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|