యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
టిక్కెట్ ధర పెంపుపై సర్వత్రా హర్షం
సోమవారం, 17 నవంబర్ 2008   ( 18:12 IST )
KS Ramarao
PC
నంది అవార్డుల ప్రదాన వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎగువ తరగతి సినిమా టిక్కెట్లను రూ.35 నుంచి రూ.50కి పెంచుకునే వీలు కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పేదలు ఎక్కువగా చూసే కిందిస్థాయి తరగతుల టిక్కెట్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచారు.

ఈ నిర్ణయంపట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్యం మండలి విభాగపు అధ్యక్షుడు కెఎస్ రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయానికి కారుకులైన ముఖ్యమంత్రి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ పార్థసారధి, మాజీ ఛైర్మన్ ఆదిశేషగిరిరావు, నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజా, దాసరి నారాయణరావులకు కృతజ్ఞతలు తెలిపారు.

వ్యాట్ తగ్గించాలని, చిన్న చిత్రాల ప్రింట్లు 35 నుంచి 75 వరకు వేసుకునే వెసులుబాటును కల్పించాలని, దీనికి పన్ను మినహాయించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిర్మాతల సెక్టార్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని మంచి పనులను పరిశ్రమకు వైఎస్ ఒక్కరే చేశారన్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బ్యాంకాక్‌లో ఈ వయసులో పాటలు
సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఏక్‌పోలీస్
వంశీకృష్ణ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్
మళ్లీ... గుడి వెనుక... జ్యోతిలక్ష్మి
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...