యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
వంశీకృష్ణ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్
శనివారం, 15 నవంబర్ 2008   ( 15:56 IST )
కాల్‌సెంటర్ ఫేం వంశీకృష్ణ హీరోగా ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని కె.బి. రాజు నిర్మించనున్నారు. దర్శకుడు సాగర్ వద్ద పనిచేసిన దాసరి బ్రహ్మేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలోని కథ, కథనం ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. ఈ కథకు వంశీకృష్ణ చక్కగా సరిపోతాడన్న ఉద్ధేశ్యంతోనే అతనిని ఎంపిక చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటివారంలో ప్రారంభించనున్నామని మిగతా విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు.

ఈ చిత్రాన్ని వైజాగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత రాజు మాట్లాడుతూ కుటుంబమంతా ఆశలు పెట్టుకున్న ఓ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో చనిపోతే వారి పరిస్థితి ఏమిటి, అటుపై జరిగిన పరిణామాలేంటనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుందని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్న ఎస్.ఎ. ఖుద్దూస్ మాట్లాడుతూ ఈ చిత్రంలో రెండు పాటలుంటాయని కథ పరంగా రీరికార్డింగ్‌కు చక్కని అవకాశముందని తెలిపారు. హీరో వంశీకృష్ణ మాట్లాడుతూ తెలుగులో తనకిది మూడవ చిత్రమని తెలిపారు. రొటీన్ ప్రేమకథగా కాకుండా ఈ చిత్రం వైవిధ్యంగా ఉంటుందని వంశీకృష్ణ తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మళ్లీ... గుడి వెనుక... జ్యోతిలక్ష్మి
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
28న దేవరకొండ వీరయ్య విడుదల
జానకి చెంతకు సుశీల జాతీయ అవార్డు
అందరినీ నమ్మడం నా బలహీనత: బిందు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...