|
| సంగీతాన్ని కొత్తగా ఎవరూ సృష్టించలేరు: ఇళయరాజా |
ఎగిరే పక్షిని ఫొటోతీసి, దానిని కంప్యూటర్లో పెట్టి రకరకాలుగా చూపించవచ్చు. అయితే సంగీతం మాత్రం కంప్యూటర్ పక్షి కాదని స్వరచక్రవర్తి ఇళయరాజా చెప్పారు. భూమిక హీరోయిన్గా నటిస్తున్న "మల్లెపూవు" ఆడియో వేడుకలో ఇళయరాజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగీతాన్ని కొత్తగా ఎవరూ సృష్టించలేరని చెప్పారు. ఉన్న షడ్జమంతోనే ఏదైనా చేస్తున్నామన్నారు. స్వరం, సంగీతం దానికది సంభవించాలని పేర్కొన్నారు. నాకూ సంగీతం గురించి తెలియదు. నిరంతరం దాని గురించి తెలుకునే ప్రయత్నం చేస్తున్నానని ఇళయరాజా తెలిపారు. సంగీతం దానంతట అదే ఉద్భవిస్తుందన్నారు.
చిత్ర దర్శకుడు రమేష్ వర్మ గతంలో ఒక సినిమాకు సంగీతం అందించమని కోరారు. చేయడం కుదరలేదు. ఈసారి వేటూరి రికమండేషన్తో వచ్చారు. కథ ఒకసారి వినమన్నారు. రమేష్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో సంగీతం సమకూర్చేందుకు అంగీకరించానని ఇళయరాజా తెలిపారు.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియోను మార్కెట్లోకి విడుదల చేశారు. నటి జయసుధ తొలి క్యాసెట్ను ఆవిష్కరించి తారకరత్నకు అందించారు. అనంతరం తొలి సీడీని నిర్మాత డి.సురేష్ బాబు ఆవిష్కరించి, తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ఇళయరాజా చాలాకాలం తరువాత తెలుగుచిత్రానికి సంగీతం అందించడం పట్ల ఈ ఆడియో వేడుకలో పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|